ఖరీదైన సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించిన తక్షణమే.. చర్యలు మొదలయ్యాయి. ఈ దిశగా.. మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. సచివాలయంలో కీలకమైన అంశాలపై చర్చించింది. ఆర్థిక మంత్రి బుగ్గన, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, , ఇంధన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అటు ఈ ఉన్నత స్థాయి కమిటీలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను తప్పించిన రాష్ట్రప్రభుత్వం.. న్యాయపరమైన సలహాలు ఇచ్చేందుకు ఆయన స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని సభ్యుడిగా ప్రకటించింది.