ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సముద్రంలో నలుగురు చిన్నారుల గల్లంతు..!

By

Published : Jun 16, 2022, 1:43 PM IST

Updated : Jun 16, 2022, 7:59 PM IST

Four children drowned in the sea
చిన్నారుల గల్లంతు

13:39 June 16

బాపట్ల జిల్లాలో నలుగురు గల్లంతు

బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. హార్బర్ నుంచి సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. షాజియా సుల్తానా(12) అనే పాప మృతి చెందగా... అస్సద్ ఖాన్(10)అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలల తాకిడికి నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. మాహే జబిన్(9), షాహిద్(8) అనే మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తెనాలిలో ఓ పెళ్లి వేడుకకు వచ్చిన సుమారు 40 మంది బంధువులు... విహార యాత్ర కోసం నిజాంపట్నం వచ్చారు. హార్బర్ నుంచి బోటులో ఎక్కి సముద్రం వద్దకు వెళ్లారు. కొద్దీ సమయానికే అలల ఉద్ధృతికి నలుగురు చిన్నారులు సముద్రంలో గల్లంతయ్యారు. యాత్రకు వచ్చిన వారిలో కొందరు తెనాలికి చెందిన వారు కాగా... మరి కొంత మంది హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సముద్రంలో గల్లంతైన నలుగురు చిన్నారులు తెనాలి మారిస్ పేటకు చెందిన వారని తెలిపారు. చిన్నారుల గల్లంతుతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 16, 2022, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details