ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 3:49 PM IST

ETV Bharat / state

భర్త నుంచి ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించిన మహిళ

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిత్యం వేధిస్తున్నాడని స్వాతి అనే మహిళ ఆరోపించింది. ఈమేరకు తన భర్త నుంచి ప్రాణహని ఉందని రక్షణ కల్పించాలని అనంతపురం ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించింది.

భర్త నుంచి ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించిన మహిళ
భర్త నుంచి ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించిన మహిళ

అనంతపురంకు చెందిన స్వాతి, ముని శేషారెడ్డిలు 6 నెలల క్రితం రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. గత మూడు నెలలుగా తన భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని స్వాతి అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ముని శేషారెడ్డి గతంలోనూ నలుగురు మహిళలను వివాహం చేసుకొని మోసం చేసినట్లు ఆమె తెలిపారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి బెయిల్ పై వచ్చి మరల దాడులకు పాల్పడుతున్నారని.. దీనిపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకొని అతడి నుంచి రక్షణ కల్పించాలని ఆమె కోరింది.

ఇదీ చదవండి

రాహుల్​ హాథ్రస్​ పర్యటన అడ్డుకునేందుకు యోగి వ్యూహం

ABOUT THE AUTHOR

...view details