అనంత జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
అనంతపురం జిల్లాలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉరవకొండలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉరవకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మంత్రిని కోరారు.
హిందూపురంలో రాష్ట్ర వాల్మీకి సేవాదళ్ అధ్యక్షుడు అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని నిర్వహించారు. వాల్మీకి వర్గానికి చెందిన చెందిన మహిళలు జ్యోతులు మోశారు. అనంతరం మహర్షి వాల్మీకి దేవాలయం లో ఉన్న మూలవిరాట్టుకు విశేష పూజలు నిర్వహించారు.