ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగులో ఇద్దరి మృతదేహాలు.. అంతటా అనుమానాలు

వాగులో రెండు మృతదేహాలు తేలడం.. అనంతపురం జిల్లా బి.రాయపురం గ్రామంలో కలకలం సృష్టించింది. మృతులు గ్రామస్తులే అని తేలడంపై అంతా నివ్వెరపోయారు. ఆ ఇద్దరూ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Sep 26, 2019, 6:38 PM IST

వాగులో మృతదేహాలు లభ్యం...అనుమానాలు వ్యక్తం

వాగులో మృతదేహాలు లభ్యం...అనుమానాలు వ్యక్తం

అనంతపురం జిల్లా మడకశిర మండలం బి.రాయపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ మేరకు వాగులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలడం.. గ్రామస్తులను కలవరపెట్టింది. సమాచారం తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. ఆరా తీయగా ఆ వ్యక్తులు అదే గ్రామానికి చెందిన వారుగా నిర్ధరించుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరి మృతిపై బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా చంపి పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details