రంజాన్ దృష్ట్యా అనంతపురం జిల్లా ఉరవకొండలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ముస్లిం మత పెద్దలతో పోలీసు, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఇళ్ల వద్దే రంజాన్ ప్రార్థనలు చేయాలని సీఐ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ప్రభుత్వ వైద్యాధికారి కోరారు. ప్రతి మసీదులో ఇమామ్, మౌజన్తో పాటు మరో ముగ్గురికి అనుమతితో అజాన్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. అనంతరం ముస్లింలకు పోలీసులు మిఠాయిలు ఇచ్చారు.