ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 18, 2020, 8:58 PM IST

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు పోలీసుల సన్మానం

కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ అంతా ఇంతా కాదు. అలాంటి వారి కష్టాన్ని గుర్తించి వారికి పూలదండలు, శాలువాలతో సన్మానం చేశారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి పోలీసులు. తమ జీతాల్లో నుంచి కొంత డబ్బును సైతం కేటాయించి వారికి అందజేశారు.

police falicitate municipal workers at ananthapur district
అనంతలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన పోలీసులు

కరోనాకు భయపడి అందరూ ఇళ్లలో ఉంటే... ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు అనంతపురం జిల్లా సోమందేపల్లి పోలీస్ సిబ్బంది. గ్రామంలో లాక్ డౌన్​లో భాగంగా రోజు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న శ్రమను గుర్తించి వారిని సన్మానించారు. పెనుకొండ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో 32 మంది కార్మికులకు పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించి... ఐదు రకాల పండ్లు, కిలో చికెన్, తమ జీతంలో నుంచి కొంత సొమ్మును కేటాయించి వారికి అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details