ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెవిలో పువ్వు పెట్టుకొని... నిరసన దీక్ష - latest news on amaravathi

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో... అమరావతి పరిరక్షణ సమితి బాధ్యులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

parirakshana-samithi-vinutna-nirasana
అనంతపురంలో అమరావతి కోసం నిరసనలు

By

Published : Dec 31, 2019, 7:27 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో నిరనస చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో స్థానికులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చెవిలో పూలు పెట్టుకొని కదిరి-హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు చేసుకోబోమని చెప్పారు. ఆలోచన మారకపోతే నిరశన దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

అనంతపురంలో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details