ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీటీసీ సభ్యుడిపై దాడి... తలకు తీవ్ర గాయాలు

గొడ్డు వెలగల గ్రామంలో కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణను దృష్టిలో పెట్టుకుని ఎంపీటీసీ సభ్యుడిపై బండరాయితో దాడి చేశాడు ఓ వ్యక్తి.

By

Published : May 31, 2019, 8:47 PM IST

ఎంపీటీసీ సభ్యుడిపై వైకాపా కార్యకర్త దాడి-తలకు తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా గొడ్డు వెలగల గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడిపై దాడి జరిగింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా కార్యకర్తతో స్వల్ప ఘర్షణ జరిగిందని... దానిని మనసులో పెట్టుకుని తనపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించాడు. వ్యక్తిగత పని మీద కదిరి వెళ్లి తిరిగి గ్రామానికి వచ్చేందుకు ఆటో ఎక్కుతుండగా వైకాపా కార్యకర్త జయచంద్ర బండరాయి విసిరినట్లు బాధితుడు వీరమనాయుడు తెలిపాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నిందితుడిని స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయినట్లు సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details