అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల, రాకెట్ల పరిధిలోని గ్రామ సచివాలయాలను శనివారం జేసీ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాలలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల పనితీరు, సిబ్బంది హాజరు.. అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. కొవిడ్ లోక్ డౌన్ సమయంలో ప్రభుత్వం అందించిన వెయ్యి రూపాయల సహాయాన్ని.. దాదాపు వంద మందికి పైగా ఇవ్వలేదని బాధితులు జేసీ దృష్టికి తెసుకెళ్లారు. గ్రామంలో వాలంటీర్ల పనితీరు పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించే విధంగా సచివలయాల పనితీరు మెరుగుపడాలని సిబ్బందిని ఆదేశించారు.
గ్రామ సచివాలయాల్లో జేసీ తనిఖీ.. వాలంటీర్ల పనితీరుపై అసహనం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల, రాకెట్ల పరిధిలోని గ్రామ సచివాలయాలను శనివారం జేసీ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాలంటీర్ల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
గ్రామ సచివాలయాల్లో జేసీ తనిఖీ-వాలంటీర్ల పనితీరుపై తీవ్ర అసహనం
TAGGED:
Jc sachivalayam thaniki.