ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోతకు గురవుతున్న హంద్రీనీవా ప్రధాన కాలువ

By

Published : Oct 13, 2020, 11:21 PM IST

Updated : Oct 14, 2020, 3:54 AM IST

నిర్లక్ష్యం చేస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని.. హంద్రీనీవా ప్రధాన కాలువకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అధికారులను కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాలువ కోతకు గురవుతుంది.

Handri neeva main canal undergoing erosion at uravakonda anantapur district
కోతకు గురవుతున్న హంద్రీనీవా ప్రధాన కాలువ

కోతకు గురవుతున్న హంద్రీనీవా ప్రధాన కాలువ

నిర్లక్ష్యం చేస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించాలని అధికారులను టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వరద నీరు, ఇతర కారణాల వల్ల అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కోతకు గురవుతుంది. కొద్దికొదిగా మట్టిపెళ్లలు విరిగి నీళ్లలోకి పడుతుండడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

గట్టు తెగి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, పంట పోలాలు జలమయం అయ్యే అవకాశం ఉందని.... వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను పయ్యావుల కేశవ్ కోరారు.

Last Updated : Oct 14, 2020, 3:54 AM IST

ABOUT THE AUTHOR

...view details