అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో పోలీసులు దాడులు చేశారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి... లక్ష ఐదు వందల తొంభై రూపాయల నగదు, 9 సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గన్నేవారిపల్లి కాలనీలోని ప్రతాప్రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారంతో... డీఎస్పీ శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...9 మంది అరెస్టు
అనంతపురం జిల్లా గన్నేవారిపల్లికాలనీలోని జరిపిన దాడులలో... 9 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
పేకాట స్థావరాలపై దాడులు జరిపిన పోలీసులు