ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 1:12 PM IST

ETV Bharat / state

డీఎంహెచ్​వో కార్యాలయం ఎదుట సీపీఎం నాయకుల ధర్నా

పట్టణంలోని డీఎంహెచ్​వో కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. సర్వజనాసుపత్రిలో సాధారణ రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని..., జిల్లాలో నిర్మిస్తున్న సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని కొవిడ్​ ఆసుపత్రిగా మార్చాలంటూ డిమాండ్​ చేశారు.

cpm leaders protest at dmho office in ananthapur to solce the problems of normal patients in ggh
డీఎంహెచ్​వో కార్యాలయం వద్ద నిరసన

అనంతపురం డీఎంహెచ్​వో కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. జిల్లాలో నిర్మిస్తున్న సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని కొవిడ్​ కేంద్రంగా మార్చాలంటూ నిరసన చేపట్టారు. జీజీహెచ్​ని కొవిడ్​ సెంటర్​గా మార్చడం వల్ల సాధారణ రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సహజ మరణం పొందిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అధిక వసూలు చేస్తున్నారని.. కనుక ప్రభుత్వమే అంబులెన్స్​లను ఏర్పాటు చేయాలని కోరారు. హోం క్వారంటైన్​లో ఉన్న వారికి పౌష్ఠికాహారంతో పాటు రూ. 7 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details