ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 29, 2019, 7:25 PM IST

ETV Bharat / state

'కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది'

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్​ఆర్సీపై స్పష్టత ఇచ్చేందుకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ దియోధర్  అనంతపురంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను కావాలనే అయోమయానికి గురిచేస్తుందని ఆయన ఆరోపించారు.

BJP National secretary speech about CAA NRC
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భాజపా సంకల్పించింది. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ దియోధర్ అనంతపురం జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. పొరుగు దేశాల్లో మతహింసను తట్టుకోలేక భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పిస్తున్నామని దియోధర్ పేర్కొన్నారు. ఎవరి పౌరసత్వాన్ని తీసుకోవటంలేదని ఆయన తెలిపారు. ఈ చట్టంపై కాంగ్రెస్, వామపక్షాలు ప్రజలను అయోమానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. కావాలనే సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం రాష్ట్ర రాజధానిపై స్పందించిన ఆయన... తెదేపా, వైకాపా రాష్ట్ర ప్రయోజనాలకోసం కాకుండా తమ సొంత లాభాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details