నిత్యం రద్దీగా ఉండే ఏటీఎంలలో దొంగలు పడి సొమ్మును దోచుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ పక్కన ఉన్న ఏటీఎంలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. రాడ్లతో కొట్టి చోరీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే యంత్రం ఎంతసేపటికీ తెరుచుకోకపోవడం వల్ల అందులో ఉన్న డబ్బును దోచుకోలేకపోయారు. ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ వద్ద ఏటీఎంలో దొంగల బీభత్సం
గుంతకల్లు రైల్వే ఇనిస్టిట్యూట్ సమీపంలోని ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎంను రాడ్లతో కొట్టి డబ్బు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఏటీఎం యంత్రం తెరుచుకోకపోవడం వల్ల వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు ఉదయాన్నే విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఏటీఎంను పరిశీలిస్తున్న పట్టణ పోలీసు సిబ్బంది