ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలి' - పెనుకొండలో కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత దీక్ష వార్తలు

అనంతపురం జిల్లా పెనుకొండలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్ పర్సన్ సవిత.. 12 గంటల దీక్ష చేపట్టారు. మద్యపాన నిషేధం అమలు చేయాలని, లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ap state kuruba corporation former chairman savitha protest at penukonda ananthapuram district
12 గంటల దీక్ష చేస్తున్న కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత

By

Published : May 11, 2020, 3:15 PM IST

రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా పెనుకొండలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్ పర్సన్ సవిత 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు దీక్ష చేపట్టినట్లు తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ప్రభుత్వం 10 వేల రూపాయలు తక్షణ సాయం అందించాలన్నారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. స్థానిక తెదేపా నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details