ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 22, 2021, 11:13 AM IST

ETV Bharat / state

జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఘన విజయం

మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయం సాధించింది. అండర్-20 విభాగంలో జరిగిన ఈ పోటీలు.. ఆదివారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్​లో మహారాష్ట్ర జట్టుపై 13 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

andhra pradesh wins in national level kho kho competitions held in maharastra
జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఘన విజయం

జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మహారాష్ట్రలోని పూణేలో 7వ బ్లాక్ ఖోఖో జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలను మహారాష్ట్ర ఖోఖో సమాఖ్య నిర్వహించింది. అండర్ - 20 విభాగంలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న ఏపీ జట్టు ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహారాష్ట్ర జట్టుపై 13 పాయింట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు ఈ టోర్నీలో ఐదు రాష్ట్రాల జట్లతో ఏపీ జట్టు వరుస విజయాలను పొందింది. ఈ జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉండగా వారిలో 9 మంది ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామానికి చెందిన వారే. మిగతావారిలో ఒకరిది చిత్తూరు జిల్లా కాగా.. మరో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉన్నారు. ఈ టోర్నీ ఉత్తమ ఆటగాడిగా ఆమిద్యాలకు చెందిన రవి అవార్డు అందుకున్నాడు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఘన విజయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details