ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పోలీసులపై దాడి... తుపాకీతో ఖైదీ పరార్​

రిమాండ్​లో ఉన్న ఖైదీ పోలీసులపై దాడి చేసి తుపాకీతో తప్పించుకున్న ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులపై దాడి.. తుపాకీతో ఖైదీ పరార్​
పోలీసులపై దాడి.. తుపాకీతో ఖైదీ పరార్​

By

Published : Apr 5, 2020, 8:19 PM IST

తెలంగాణలోని నిజామాబాద్ నగరంలోని గౌతమ్​నగర్​కు చెందిన ప్రసాద్​ను ఇటీవల దొంగతనం కేసులో మాక్లూర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితునికి కోర్టు రిమాండ్ విధించడం వల్ల సారంగాపూర్ జైలులో ఉంచారు. కాగా అతను నిన్న అనారోగ్యానికి గురవడం వల్ల నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

అయితే అతను రాత్రి 10.30 గంటల సమయంలో ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి చేసి హాండ్​కప్స్ ఉండగానే తుపాకీతో పారిపోయాడు. సిబ్బంది సమాచారం మేరకు ఒకటో పట్టణ పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. పారిపోయిన ఖైదీ కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులపై దాడి.. తుపాకీతో ఖైదీ పరార్​

ఇదీ చూడండి:ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

ABOUT THE AUTHOR

...view details