ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహబూబ్​నగర్​లో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం

By

Published : Dec 6, 2019, 12:53 PM IST

దిశ హత్య కేసులో ఎన్​కౌంటర్​కు గురైన నిందితుల మృతదేహాలకు ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలోనే శవపంచనామా చేయనున్నారు. అనంతరం మహబూబ్​నగర్​ జిల్లా ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి, కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు.

asdf
asdf

మహబూబ్​నగర్​లో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
మహబూబ్​నగర్​లో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం

దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలో శవపంచనామా నిర్వహించనున్నారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మహబూబ్​నగర్​ జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు.

శవపంచనామా నిమిత్తం ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతానికి ఉస్మానియా వైద్యులను పిలిపించారు. స్థానిక మేజిస్ట్రేట్‌ సమక్షంలో ఒక్కో మృతదేహానికి ఒక్కో న్యాయాధికారి సమక్షంలో శవపంచనామా జరగనుంది.

తరువాత మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు. అక్కడ శవపరీక్ష నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

ABOUT THE AUTHOR

...view details