ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2023, 2:15 PM IST

ETV Bharat / crime

భర్తను చంపి.. పక్కనే నిద్రించిన భార్య.. ఆ తర్వాత..!

Wife Killed Husband: నిత్యం మద్యం తాగి వచ్చి తనను వేధిస్తున్నాడని ఓ భార్యతన భర్తను చంపింది. అనంతరం మృతదేహాం పక్కనే రాత్రంతా నిద్రించింది. ఉదయం తన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడి వారిని నమ్మించింది. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Wife Killed Husband
Wife Killed Husband

Wife Killed Husband: మద్యం మత్తులో వేధిస్తున్నాడని నిద్రిస్తున్న భర్తపై కత్తితో భార్య హత్య చేసింది. అనంతరం రక్తపు మడుగులో కొట్టుకొని ప్రాణాలు విడిచిన భర్త పక్కనే నిద్రించింది. ఉదయం ఎప్పటిలా ఇంటి పనులు చేసిన ఆమె.. 8 గంటలకు భర్త ఉరేసుకొని చనిపోయాడని విలపిస్తున్నట్లు నటించింది. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. నానాజీపూర్‌కు చెందిన ఒల్కే రాజు(40), జ్యోతి దంపతులు. వీరికి పదేళ్ల లోపు కుమారుడు, కూతురు ఉన్నారు. దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రాజు మద్యానికి బానిసయ్యాడు. పనులకు వెళ్లకుండా జులాయిగా తిరగడమే కాకుండా భార్య ప్రవర్తనను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో నిత్యం గొడవ పడేవారు.

దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా తీరు మారలేదు. శనివారం మద్యం మత్తులో రాజు.. తన పిల్లలతో పాటు భార్యపై దాడి చేశాడు. కోపోద్రిక్తురాలైన భార్య జ్యోతి నిద్రిస్తున్న భర్త రాజుపై అర్ధరాత్రి కత్తితో దాడి చేసి హతమార్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మృతి చెందడం, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చిన్నారులు విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details