తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యాయవాదులను హతమార్చిన అనంతరం ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు వెల్లడించగా... విశాఖ నుంచి గజ ఈతగాళ్లను రప్పించిన పోలీసులు కత్తుల కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ: న్యాయవాదుల హత్యకేసులో కత్తుల కోసం గజ ఈతగాళ్ల వేట
తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. నిందితులు వాడిన కత్తులను వెలికితీసేందుకు విశాఖకు చెందిన గత ఈతగాళ్లను పోలీసులు రంగంలోకి దింపారు. సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం... గాలింపు చేపట్టారు.
తెలంగాణ: న్యాయవాదుల హత్య కేసులో కత్తుల కోసం గజ ఈతగాళ్ల వేట
మరోవైపు కేసులోని ముగ్గురు నిందితులు మూడు రోజులుగా కస్టడీలో ఉన్నారు. తాజాగా నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కూడా మంథని కోర్టు కస్టడీకి ఇచ్చింది. హత్యకు సంబంధించిన కారణాలు... దాని వెనక ఉన్నవారి వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.