ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

లైవ్ వీడియో: టోల్​ ప్లాజా వద్ద లారీ బీభత్సం

తెలంగాణలోని కరీంనగర్‌-హైదరాబాద్‌ రాజీవ్‌రహదారిలో రేణిగుంట టోల్‌ ప్లాజా మరమ్మతుల్లో అపశ్రుతి చోటుచేసుంది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ లారీ... క్రేన్​ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : May 3, 2021, 10:04 PM IST

lorry accident at renigunta toll plaza
lorry accident at renigunta toll plaza

తెలంగాణలోని కరీంనగర్‌-హైదరాబాద్‌ రాజీవ్‌రహదారిలో రేణిగుంట టోల్‌ ప్లాజా వద్ద ప్రమాదం చోటు చేసుకొంది. టోల్‌ప్లాజా వద్ద పైకప్పును విస్తరించేందుకు భారీ క్రేన్‌ సహాయంతో మరమ్మతులు చేస్తుండగా... హైదరాబాద్ వైపు నుంచి ఓ లారీ అతివేగంతో దూసుకువచ్చింది. లారీ ఢీకొనటం వల్ల క్రేన్​ ముందుకు కదిలి... దానిపైన పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు కింద పడి తీవ్రగాయాల పాలయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

లైవ్ వీడియో: టోల్​ ప్లాజా వద్ద లారీ బీభత్సం

గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను హుటాహుటిన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరుగుతున్న పనిని లారీ డ్రైవర్​ గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా... లేదా నిర్లక్ష్యం వల్లే జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి:

ఈ తరం యువతకు సబ్బం హరి ఆదర్శనీయం: ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details