ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వినూత్నం...చిత్రలేఖనంతో సందేశం

By

Published : Oct 11, 2020, 11:03 PM IST

విశాఖపట్నంలో 'సేవ్ ల్యాండ్- సేవ్ వైజాగ్' అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో యువ చిత్రకారులు ప్రతిభ కనబరిచారు. సందేశానికి సృజనాత్మకత జోడించి వారెవ్వా అనిపించారు.

painting competition in Visakhapatnam
painting competition in Visakhapatnam

విశాఖపట్నంలో భూముల్ని సంరక్షించే దిశగా యువత వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. 'సేవ్ ల్యాండ్- సేవ్ వైజాగ్' అనే అంశంపై ఆదివారం చిత్రలేఖనం పోటీలను నిర్వహించింది. సామాన్య ప్రజలకు కలిగే ఇబ్బందులు, ఆక్రమణలతో వచ్చే సమస్యలను సృజనాత్మకంగా ఆవిష్కరించారు చిత్రకారులు. పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టారు. 'సిటీ స్పీక్స్' సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తమ హక్కులను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భూ సమస్యల పరిష్కారంలో ప్రజలకు అండగా ఉండేందుకు సిటీ స్పీక్స్ లీగల్ సెల్​ను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details