ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దీపావళి సంబరాలతో కేజీహెచ్​లో చీకట్లు..గంటకుపైగా అంధకారం

By

Published : Oct 28, 2019, 7:37 PM IST

దీపావళి సంబరాలు అన్ని చోట్ల వెలుగులు నింపితే... విశాఖ కేజీహెచ్​లో మాత్రం చీకట్లు అలుముకునేలా చేశాయి. దాదాపు గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి రోగులు ఇక్కట్లకు గురయ్యారు.

కేజీహెచ్

కేజీహెచ్​కు నిలిచిన విద్యుత్ సరఫరా

విశాఖలోని కేజీహెచ్​లో ఆదివారం రాత్రి దాదాపు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచింది. ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆదివారం రాత్రి 7 నుంచి 8.15 గంటల వరకు విద్యుత్ నిలిచిపోయింది. వార్డుల్లో అలుముకున్న చీకటితో రోగులు ఇక్కట్లకు గురయ్యారు. దాదాపు రెండు గంటలపాటు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. కేజీహెచ్​కి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ తీగలపై దీపావళి మందుగుండు నిప్పులు పడటం వల్ల అంతరాయం కలిగిందని అధికారులు చెప్పారు. జనరేటర్ ఉన్న వార్డులు, అత్యవసర వార్డులకూ కొంత ఇబ్బంది తప్పలేదు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details