విశాఖ ఉత్సవ్ను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి బొత్స సత్య నారాయణ విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి రెండు రోజుల పాటు జరిగే వేడుక కోసం విస్తృత ప్రచారం చేస్తున్నామని మంత్రి అవంతి చెప్పారు. ఇదే సమయంలో ఈనెల 28న కైలాసగిరిపై వీఎంఆర్డీఏ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్లో ఫ్లవర్షోనూ ప్రారంభిస్తారని చెప్పారు. విశాఖ ఉత్సవ్ మొదటి రోజు బీచ్లో కళాకారులతో కార్నివాల్ ఉంటుందని, విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఉత్సవ్లో దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ సంగీత విభావరి ఏర్పాటు చేశామని వెల్లడించారు.
'విశాఖ ఉత్సవ్ను అట్టహాసంగా నిర్వహిస్తాం' - విశాఖ ఉత్సవ్ వార్తలు
విశాఖ ఉత్సవ్ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. కార్నివాల్, లేజర్షో, దేవీశ్రీప్రసాద్, తమన్ల సంగీత విభావరి, ఫ్లవర్షో వంటివి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
!['విశాఖ ఉత్సవ్ను అట్టహాసంగా నిర్వహిస్తాం' minister srinivas about vishaka ustav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5471613-623-5471613-1577125913812.jpg)
ప్రచార చిత్రం విడుదల
విశాఖ ఉత్సవ్ను అట్టహాసంగా నిర్వహిస్తామన్న మంత్రి అవంతి
ఇదీ చూడండి: