ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గీతం వర్సిటీ అప్పీల్​పై విచారణ వాయిదా​

By

Published : Oct 30, 2020, 4:40 AM IST

విశాఖ గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టులో అప్పీల్​కు వెళ్లింది. ఆ పిటిషన్​పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. నవంబర్ 2కు విచారణ వాయిదా వేసింది.

High court
High court

విశాఖలోని గీతం వర్సిటీకి చెందిన కట్టడాల కూల్చివేత విషయంలో ఈ నెల 25న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆ సంస్థ అప్పీల్​ దాఖలు చేశారు. ఈ అప్పీల్​పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. తమ స్వాధీనంలోని క్యాంపస్​ను పరిరక్షిస్తూ ఉత్తర్వులివ్వాలని అప్పీల్​లో యాజమాన్యం కోర్టును అభ్యర్థించింది. కూల్చివేతకు ముందున్న స్థితిని కొనసాగించాలని కోరింది. హైకోర్టు నవంబర్​ 2కు విచారణ వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details