ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DEATH : విషాదం... నీటి కుంటలో పడి చిన్నారి మృతి

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

By

Published : Aug 23, 2021, 11:55 PM IST

Updated : Aug 24, 2021, 4:03 AM IST

నీటి కుంటలో పడి చిన్నారి మృతి
నీటి కుంటలో పడి చిన్నారి మృతి

విశాఖ జిల్లా పాడేరు మండలంలోని లింగాపుట్టు గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి గ్రేస్... జి.మాడుగుల మండలం వరదలపాలెం గ్రామానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తు గ్రేస్ పడిపోయింది. పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో... కుటుంబసభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న నీటి కుంట వద్ద గ్రేస్ చెప్పులు ఉండడంతో అందులో దిగి చూడగా... చిన్నారి మృతదేహం లభ్యమైంది. తమ కళ్ల ముందే ఆటలాడుకుంటున్న చిన్నారి... విగతజీవిగా మారడంతో గ్రేస్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

Last Updated : Aug 24, 2021, 4:03 AM IST

ABOUT THE AUTHOR

...view details