ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 12, 2021, 8:37 PM IST

ETV Bharat / city

ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..కౌన్సెలింగ్ ఎప్పుడంటే..

విశాఖలోని ఏయూలో ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను కన్వీనర్ విడుదల చేశారు. అందుబాటులో ఉన్న సీట్లకు త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను కన్వీనర్ విశాఖలోని ఏయూలో విడుదల చేశారు. మెుత్తం 15,368 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 13,619 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఎడ్‌సెట్‌లో 98.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించనున్నట్లు కన్వీనర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details