ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 9:46 AM IST

ETV Bharat / city

విశాఖకు డీఆర్​డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి

డీఆర్​డీవో ఛైర్మన్ సతీష్​రెడ్డి విశాఖ వచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైనట్లు తెలిసింది.

saitsh reddy
సతీష్ రెడ్డి, డీఆర్​డీవో ఛైర్మన్

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో) ఛైర్మన్‌ జీ. సతీశ్‌రెడ్డి గురువారం రాత్రి విశాఖ వచ్చారు. నావికా సమరశాస్త్ర సాంకేతిక ప్రయోగశాల (ఎన్‌.ఎస్‌.టీ.ఎల్‌.) సంచాలకులు నందగోపన్‌ ఆయనకు సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖలోని ఎన్‌.ఎస్‌.టీ.ఎల్‌. ప్రయోగాలకు, డీఆర్​డీవో బంగాళాఖాతం కేంద్రంగా నిర్వహించే ప్రయోగాల సమీక్షకు ఆయన గతంలో పలుసార్లు విశాఖ వచ్చారు.

ఈ తరుణంలో ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల నుంచి క్షిపణులను ప్రయోగించి వాటి పనితీరును తెలుసుకునే కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బంగాళాఖాతం కేంద్రంగానూ క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ క్రమంలో విశాఖ కేంద్రంగా గానీ, సమీప ప్రాంతాల నుంచి గానీ క్షిపణి ప్రయోగాలు నిర్వహించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు ఆ విషయాన్ని ధ్రువీకరించడంలేదు.

ABOUT THE AUTHOR

...view details