ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2020, 7:13 PM IST

ETV Bharat / city

రాష్ట్ర దివ్యాంగుల మహాసేన దీక్ష విరమణ

మంత్రి తానేటి వనిత నుంచి లభించిన హామీ మేరకు.. విశాఖలో రాష్ట్ర దివ్యాంగుల మహాసేన దీక్షను విరమించింది. ఈనెల 26 నుంచి నిరసన తెలుపుతుండగా.. ఇప్పటికి ప్రభుత్వం స్పందించిందని నేతలు తెలిపారు.

differently abled strike ended up
దీక్ష చేస్తున్న దివ్యాంగులు

సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర దివ్యాంగుల మహాసేన.. విశాఖలో చేస్తున్న దీక్షను విరమించింది. మంత్రి తానేటి వనిత నుంచి హామీ లభించగా.. దీక్షకు ముగింపు పలుకుతున్నట్లు నేతలు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలో.. అఖిల భారత దివ్యాంగుల మహాసేన జాతీయ సెక్రటరీ రామన్ సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి పాల్గొనారు. గత నెల 26 నుంచి రిలే దీక్షలు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు ప్రభుత్వం స్పందించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యదర్శి శివశంకర్, భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details