రెండు రూపాయలకే మన గుడి శుభ్రం అవుతోంది. రెండు రూపాయలతో కరోనా వైరస్ మనల్ని తాకకుండా మసీదు, చర్చి, గురుద్వారాల్లో డిసిన్ఫెక్షన్ స్ప్రేయింగ్ జరుగుతోంది. కరోనా కష్ట కాలంలో కొద్ది సమయం ప్రార్థనా స్థలానికి వెళ్లి కాస్త ఉపశమనం పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక భావనతో మనం వెళ్లే ప్రార్థనా మందిరాలకు కరోనా వైరస్ తాకకుండా ఉండాలని విశాఖకు చెందిన న్యాయవాది ఎంజీఎం ఖాన్ ముందుకొచ్చారు. ప్రార్థన స్థలాల్లోని టచ్ పాయింట్ వద్ద ప్రత్యేక ద్రవ మిశ్రమాన్ని స్ప్రే చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా పని చేస్తున్నా... కరోనాపై పోరులో భాగం కావాలని ఈ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.
రోజూ 9గంటలు సేవకు అంకితం..