ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 10, 2020, 9:13 PM IST

ETV Bharat / city

'ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి'

ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే ముత్యాలనాయుడు కోరారు. సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా.. విశాఖ జిల్లా చీడికాడ మండలంలో పాదయాత్ర చేపట్టారు.

ycp sankalpayatra
ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి

సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం జైతవరం నుంచి బైలపూడి వరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొన్నిచోట్ల మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజా సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. బైలపూడి గ్రామం వైకాపాకు కంచుకోటని.. ఇప్పటివరకు గ్రామానికి మూడున్నర కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు.

అనంతపురం జిల్లాలో..

ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ అన్నారు. నంబులపూలకుంట మండలంలోని ధనియాని చెరువు నుంచి ఎన్​పి కుంట వరకు వైకాపా శ్రేణులు పాదయాత్ర చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ..

జిల్లాలోని ఉండి నియోజకవర్గ ఇంఛార్జీ పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో పాలకోడేరు మండలంలోని గ్రామాల్లో... 'ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు' పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలో...

అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వైకాపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వైకాపా నాయకులు అన్నారు. జిల్లాలోని పెనములూరు నుంచి గుంటూరు జిల్లా తెనాలి వరకు వైకాపా శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మచిలీపట్నంలో త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి అన్నారు. దీంతో ఎంతో మంది తీర ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. బందరు పోర్ట్ అభివృద్ధికి అన్ని అనుమతులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ర్యాలీలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు పార్థసారథి, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జున రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చేశారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details