ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 11, 2019, 4:26 PM IST

Updated : Nov 11, 2019, 5:17 PM IST

ETV Bharat / city

'ఇసుక సమస్యపై తెదేపా ఆందోళనకు భాజపా మద్దతు'

ఇసుక సమస్యపై తెదేపా చేపట్టబోయే ఆందోళనకు భాజపా మద్దతుంటుదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా స్పష్టం చేశారు. ఇసుక కొరతపై ఎవరు ఆందోళన చేసినా తాము సంఘీభావం తెలుపుతామన్నారు.

ఆందోళనకు మద్దతిస్తున్నాం

ఇసుక సమస్యపై తెదేపా చేపట్టే ఆందోళనకు మద్దతిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ నెల 14న విజయవాడలో నిర్వహించే చంద్రబాబు నిర్వహించే దీక్షకు సంఘీభావం తెలపాలని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కన్నాను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు." ప్రజాసమస్యలపై తాము ఒంటరిగానే పోరాడుతున్నాం. అదే సమయంలో ఇసుక సమస్యలపై ఎవరు ఆందోళనలు చేసినా సంఘీభావం తెలియజేస్తాం."అని కన్నా వ్యాఖ్యానించారు.

'ఇసుక సమస్యపై తెదేపా ఆందోళనకు భాజపా మద్దతు'
Last Updated : Nov 11, 2019, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details