ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 23, 2020, 3:27 PM IST

ETV Bharat / city

'ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలి'

జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సుబ్రహ్మణ్యం కోరారు. నిరుద్యోగుల వయోపరిమితిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ మాసంలో నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.

unemployers demands for group exams
నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సుబ్రహ్మణ్యం

ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతానని ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సుబ్రహ్మణ్యం విజయవాడలో డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జనవరి నెలలో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు... కానీ గత జనవరిలో ఉద్యోగాలకు ఎటువంటి క్యాలెండర్ విడుదలకు నోచుకోలేదన్నారు. రాబోయే జనవరి మాసంలో అయినా ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని కోరారు. నిరుద్యోగుల వయోపరిమితిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ మాసంలో నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఏపీపీఎస్సీ విధివిధానాలను స్పష్టంగా తెలియజేయాలని సుబ్బహ్మణ్యం అన్నారు.

ABOUT THE AUTHOR

...view details