క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే వారికోసం పండ్లకిట్ను ప్రభుత్వం అందించనుంది. యాభై రూపాయల విలువ చేసే కిట్లో అరటి 6, బత్తాయి 2, నిమ్మ 2, తైవాన్జామ 2 కాయలున్నాయి. రెడ్జోన్లలోనూ ప్రజలకు పండ్ల కిట్లను అందించనున్నారు. ఈ కిట్ విలువ 150 రూపాయలు. ఇందులో అరటి 8, నిమ్మ 12, బత్తాయి 4, బొప్పాయి 1, తైవాన్జామ 2, పుచ్చకాయ 1, కర్బూజ 1 ఉంటాయి. పండ్ల కిట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆయన ఛాంబర్లో పరిశీలించి, పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికోసం ఫ్రూట్కిట్
క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారికి బలవర్థకమైన ఆహారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఉద్యానశాఖ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో పంపిణీ చేయాలని ఉద్యానశాఖ అధికారులు నిర్ణయించారు.
క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికోసం ఫ్రూట్కిట్