ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2019, 7:49 PM IST

ETV Bharat / city

ఉపాధి హామీ నిధుల బకాయిలు చెల్లించండి: రాజేంద్రప్రసాద్

ఉపాధి హామీ నిధుల బకాయిలపై రేపటినుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 2500 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు తమ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ఉపాధి హామి నిధుల బకాయిలు చెల్లించండి: తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఉపాధి హామీ నిధుల బకాయిలు చెల్లించండి: తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఉపాధి హామీ నిధుల బకాయిలకై రేపటినుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు విజయవాడలో తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నెలాఖరుకు "ఛలో అమరావతి " జరుపుతామని ప్రకటించారు. నిధుల విడుదలలో జాప్యంపై... హైకోర్టులో కేసు వేస్తామన్నారు. 13 జిల్లాల్లోని సర్పంచు​లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2500 కోట్ల బకాయిలు విడుదల చేసేవరకు తమ ఉద్యమం ఆగదని... రాజకీయ కక్షతోనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఎమ్మెల్సీ ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details