పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీసుల చర్యల వల్లే గతం కంటే ఈసారి తక్కువ అల్లర్లు జరిగాయన్నారు. ఎన్నికల్లో సమర్థంగా విధులు నిర్వహించిన పోలీసులకు అభినందనలు తెలిపారు.
'గతం కంటే తక్కువ అల్లర్లు..పోలీసుల చర్యల వల్లే సాధ్యం'
పోలీసుల చర్యల వల్లే పంచాయతీ ఎన్నికల్లో గతం కంటే ఈసారి తక్కువ అల్లర్లు జరిగాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో సమర్థంగా విధులు నిర్వహించిన పోలీసులకు అభినందనలు తెలిపారు.
గతం కంటే తక్కువ అల్లర్లు..పోలీసుల చర్యల వల్లే సాధ్యం