దేశంలోని ప్రజలందరూ భాజపా వైపు చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మల్లిఖార్జునమూర్తి సహా పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు.. విజయవాడలో కన్నా సమక్షంలో భాజపాలో చేరారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు కులం, కుటుంబం తప్ప ప్రజాసంక్షేమం పట్టదని కన్నా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిద్ధాంతాలు కలిగిన పార్టీ భాజపా అని...దేశ సమగ్రత, సమైక్యతను కాపాడేందుకు ప్రధాని మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రాంతీయ పార్టీలకు ప్రజాసంక్షేమం పట్టదు: కన్నా
రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కేవలం కులం, కుటుంబాలనే పట్టించుకుంటాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా భాజపా పనిచేస్తోందని.. అందుకే ప్రతి ఒక్కరూ తమ వైపు చూస్తున్నారని అన్నారు.
congrees leaders join in bjp presence of prseident kanna laxminaryana