విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద నుంచి పాదయాత్రగా వెళ్లేందుకు ఐకాస నేతలు యత్నించారు.వారిని పోలీసులు అడ్డుకున్నారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఐకాస నాయకులను అడ్డగించారు.ఈ క్రమంలో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు.బస్సు యాత్ర ప్రారంభించే తీరుతామని నేతలు భీష్మించారు.బస్సులు అ.ప.స.కేంద్ర కార్యాలయం వద్దకు తీసుకురావాలని...లేకుంటే తామే బస్సుల వద్దకు పాదయాత్రగా వెళ్తామని పోలీసులతో వాదించారు.దింతో చంద్రబాబు సహా ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్టులతో తమను నిలువరించలేరని....ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు మండిపడ్డారు.
అఖిలపక్షం పాదయాత్ర ఉద్రిక్తం...పోలీసుల అదుపులో చంద్రబాబు
అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో సమావేశం అనంతరం... ఐకాస నేతలు పాదయాత్రకు బయల్దేరారు. తమ బస్సు యాత్రను అడ్డుకున్నారని... ఆ బస్సుల వరకు కాలి నడకన వెళ్లి యాత్ర చేపడతామని నేతలు తేల్చి చెప్పారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.
chandrababu serious on vijayawada police