రాష్ట్రంలో వైకాపా శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో వైకాపా నేతల వేధింపులు తాళలేక విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. నిబద్దత కలిగిన పోలీసుగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సామాన్యుల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని అచ్చెన్న ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజునే విశాఖలో వైకాపా నేతలు దురుసుతనం ప్రదర్శించాని దుయ్యబట్టారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో విశ్రాంత ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్పై వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఉద్దేశ్య పూర్వకంగానే బెనిఫిట్స్ అందకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. జాప్యం వెనుక వైకాపా నాయకుల ఒత్తిడి ఉందంటూ వాంగ్మూలం ఇచ్చారన్నారు. తక్షణమే కారకులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..