ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అతని ఆత్మహత్యాయత్నానికి వైకాపా నేతలే కారణం.. తక్షణమే చర్యలు తీసుకోండి.. డీజీపీకి అచ్చెన్న లేఖ

By

Published : Feb 22, 2022, 9:06 PM IST

రాష్ట్రంలో సామాన్యుల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అయినాపురంలో వైకాపా నేతల వేధింపులు తాళలేక విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.

డీజీపీకి అచ్చెన్న లేఖ
డీజీపీకి అచ్చెన్న లేఖ

రాష్ట్రంలో వైకాపా శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో వైకాపా నేతల వేధింపులు తాళలేక విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. నిబద్దత కలిగిన పోలీసుగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సామాన్యుల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని అచ్చెన్న ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీజీపీగా రాజేంద్రనాధ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజునే విశాఖలో వైకాపా నేతలు దురుసుతనం ప్రదర్శించాని దుయ్యబట్టారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో విశ్రాంత ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్​పై వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఉద్దేశ్య పూర్వకంగానే బెనిఫిట్స్ అందకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. జాప్యం వెనుక వైకాపా నాయకుల ఒత్తిడి ఉందంటూ వాంగ్మూలం ఇచ్చారన్నారు. తక్షణమే కారకులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు.

డీజీపీకి అచ్చెన్న లేఖ

ఏం జరిగిందంటే..

మమ్మిడివరం మండలంలోని అయినాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సహాయకుడిగా ఉద్యోగ విరమణ చేసిన రాయపురెడ్డి కృష్ణమూర్తి సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణమూర్తి గతేడాది డిసెంబరులో ఉద్యోగ విరమణ చేయగా..ఆర్థిక ప్రయోజనాలు అందలేదు. అందుకు సహకార సంఘం అధికారులు పట్టించుకోకపోవటమే కారణమని భావిస్తూ మనస్తాపం చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఏటీఎం కార్డుతో కృష్ణమూర్తి సొమ్ములు కాజేయటంతో పాటు, పదవీవిరమణ ప్రయోజనాలు నిలిపివేయటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. అస్వస్థతకు గురైన అతణ్ని కాకినాడ జీజీహెచ్​కు తరలించారు.

ఇదీ చదవండి

వానల్ని తట్టుకునే రహదారులు... కసరత్తు చేస్తున్న రహదారులు, భవనాల శాఖ

ABOUT THE AUTHOR

...view details