రాష్ట్రవ్యాప్తంగా 8,270 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు
విశాఖకు చెందిన అంధ విద్యార్థినికి ప్రధాని మోదీ ప్రశంస
విశాఖలోని సాగర్నగర్ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్.మాధురిని ప్రధాని మోదీ ప్రశంసించినట్లు ప్రిన్సిపల్ ఎం.మహేశ్వరరెడ్డి వెల్లడించారు. జాతీయ జెండా విశిష్టతను వర్ణిస్తూ చేసిన ప్రసంగానికి ప్రధానమంత్రి మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారన్నారు.
ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై అంతర్గత పోరు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేటి నుంచి యాప్ ఆధారిత హాజరును విద్యాశాఖ అమలుచేస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకోవద్దని పిలుపునివ్వడంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరుకు దారితీస్తోంది.
సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో అడుగడుగునా తడబాటు
స్వేద్యం, ఆర్థిక స్వాలంబన, అభ్యుద్వయం, ఉటకించారు, సామాజిక అభ్రదత, మహానుయోధులు, వజ్జోత్సవాలు ఈ పదాలను చదువుతుంటే... ఏంటీ ? అన్నీ తప్పులతడకగా ఉన్నాయే ! అని అనిపిస్తోందా? స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ ప్రసంగంలో దొర్లిన పొరపాట్లలో ఇవి కొన్ని మాత్రమే.