ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు

కటిక పేదరికం ఓ ఇంట తీరని విషాదం నింపింది. కరోనా వైరస్‌ ఆ బాధను వెయ్యింతలు చేసింది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ కడుపేదరికంతో దూరం కాగా... లోకాన్ని వీడిన బిడ్డ మహమ్మారి కారణంగా గౌరవంగా సాగనంపలేకపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన చూపరుల హృదయాన్ని ద్రవింపచేస్తోంది.

By

Published : May 11, 2020, 8:10 PM IST

a boy died in bhadradri kothagudem
ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు

ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుందరయ్యనగర్ కాలనీకి చెందిన ఫరీదా భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు పిల్లలుండగా... వీరిలో చిన్నవాడైన సాదిక్ రెండేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్య చేయించే స్థోమత లేని ఆ కుటుంబం.... స్థానిక ఆస్పత్రులోనే చూపించింది.

ఇటీవల బాబు ఆరోగ్యం మరింత క్షీణించగా..... ఏం చేయలేని ఆ తల్లి దేవునిపై భారం వేసింది. నిన్నరాత్రి సాదిక్ మృతిచెందగా... కుమారుడి అంత్యక్రియలు చేయటం కూడా వారికి భారంగా మారింది. సాదిక్ మృతదేహాన్ని తన తాత రిక్షాలో తీసుకువెళ్లి.... గోదావరి పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియలకు బంధువులు కూడా ఎవరూ హాజరుకాకపోవటంతో ఫరీదా, తన మామతో కలిసి కుమారుడి అంత్యక్రియలు నిర్వహించింది.

ఇదీ చూడండి: కేంద్రం ఆర్థికంగా సహకరించాలి: ప్రధానితో సీఎం

ABOUT THE AUTHOR

...view details