ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యే రోజా దాతృత్వం... స్విమ్స్​కు 10 స్ట్రెచర్లు విరాళం

By

Published : Sep 14, 2020, 5:50 PM IST

వైకాపా ఎమ్మెల్యే రోజా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా తిరుపతి స్విమ్స్​కి రూ.2 లక్షల విలువైన స్ట్రెచర్లు విరాళంగా అందించారు. ఆర్.కె రోజా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆమె తెలిపారు.

ఎమ్మెల్యే రోజా దాతృత్వం... స్విమ్స్​కు 10 స్ట్రెచర్లు విరాళం
ఎమ్మెల్యే రోజా దాతృత్వం... స్విమ్స్​కు 10 స్ట్రెచర్లు విరాళం

చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆసుపత్రికి ఆర్​.కె రోజా ఛారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఎమ్మెల్యే రోజా 10 స్ట్రెచర్​లను విరాళంగా అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్ట్రెచర్లు చాలా అవసరమని భావించి, తన స్వచ్ఛంద సంస్థ ద్వారా వాటిని సమకూర్చామని ఆమె తెలిపారు. సుమారు రూ.2 లక్షల విలువైన సామాగ్రి అందించామన్నారు.

ఆర్.కె రోజా ఛారిటబుల్ సంస్థ ఇలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రవ్యాప్తంగా ఆసరా కార్యక్రమాలు...పట్టని కరోనా నిబంధనలు

ABOUT THE AUTHOR

...view details