ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 15, 2021, 6:57 AM IST

ETV Bharat / city

అదుపుతప్పిన ద్విచక్రవాహనం... ఇద్దరు యువకులకు గాయాలు

ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో తిరుమలలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. కొండపై నుంచి కిందకు వస్తుండగా.. మలుపు వద్ద పిట్టగోడను ఢీకొని లోయలో పడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

road accident in tirumala, two wheeler accidents in tirumala
తిరుమలలో రోడ్డు ప్రమాదం, తిరుమలలో ద్విచక్రవాహన ప్రమాదం

తిరుమల మెదటి కనుమలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ఎగిరి 10 అడుగుల లోయలో పడ్డారు. ఒకరికి కాలికి, మరొకరికి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. కొండపై నుంచి కిందకు దిగే సమయంలో.. మలుపు వద్ద ఉన్న పిట్టగోడను వాహనం బలంగా ఢీకొంది. ప్రమాదాన్ని గమనించిన ఇతర భక్తులు వారిని కాపాడారు. భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details