కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా ( chittoor district ) లోని తిరుమల( heavy rains in tirumala) గిరులు భయోత్పాతాన్ని సృష్టించాయి. ఆలయ పరిసరాలన్నీ వరద నీటి(flood water) తో నిండిపోయాయి. మాడవీధులన్నీ వాగులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుమల (tirumala) పరిస్థితులు భీతావహమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల్లోకి నీరు చేరి.. చెరువును తలపించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది.
విరిగిపడిన కొండచరియలు..
కనుమదారుల్లో వరద నీరు జలపాతాల (Waterfalls) మాదిరిగా పడుతుండటంతో కొండచరియలు ( landslides Broken ) విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు పడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే (ttd)... శుక్ర, శనివారాలు సైతం అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి. మొదటి కనుమ రహదారిలో మాత్రమే భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. కొండ చరియలు విరిగి పడుతుండటంతో రెండు ఘాట్రోడ్లు మూసివేయాలని తితిదే యోచిస్తోంది.
వర్షం తగ్గాకే భక్తులకు అనుమతి ..
పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం తితిదే (ttd) మూసివేసింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది. కండపోత వర్షానికి (heavy rain) టూరిజం హోటల్ ప్రహరీగోడ కూలి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. శిథిలాల కింద నారాయణ అనే కార్మికుడి కాలు ఇరుక్కుపోవడంతో కట్టర్లతో ఇనుపకడ్డీలు కత్తిరించి అతికష్టం మీద బయటకు తీశారు.