తిరుమల శ్రీవారిని.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో.. అదనపు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయ నాదనీరాజనం వేదికపై నిర్వహించిన సుందరకాండ పారాయణంలో.. కేంద్రమంత్రి పాల్గొన్నారు.