ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిర్లక్ష్యం.... ఆస్పత్రి ప్రాంగణంలోనే కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల వ్యర్థాలు

By

Published : Sep 7, 2020, 7:59 PM IST

కరోనా... ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. మనిషిని మనిషి తాకలేని పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇక పాజిటివ్ వస్తే అంతే సంగతులు. వారి వద్దకు వెళ్లాలంటనే భయపడిపోతున్నారు. అయితే వైరస్ బారిన పడిన వారు వాడే వస్తువులను తాకినా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ప్లాస్టిక్ వస్తువులయితే ఎక్కవ గంటలపాటు వైరస్ నిలిచి ఉంటుందని చెబుతున్నారు. కానీ నెల్లూరు జీజీహెచ్​ కోవిడ్​ రీజినల్ కేంద్రంలో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. కొవిడ్ బాధితులు వాడిన వస్తువులు, ఆహార వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు.

nellore governament  hospital
nellore governament hospital

నిర్లక్ష్యం.... ఆస్పత్రి ప్రాంగణంలోనే కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల వ్యర్థాలు

నెల్లూరు నగరంలో జీజీహెచ్​ది నాలుగు జిల్లాల స్థాయి కోవిడ్ కేంద్రం. ఈ ఆస్పత్రిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్​ బాధితులు పెరిగిపోతున్నారు. ఇప్పటికి వెయ్యి మందికిపైగా ఉన్నారు. అయితే కొవిడ్ బాధితుల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను, ప్లాస్టిక్ బాటిల్స్, మాస్క్​లను బహిరంగంగా ఆస్పత్రి ఆవరణలోనే కట్టలుగా పడేస్తున్నారు. క్వారంటైన్​ గదుల వెనుకవైపున ప్లాస్టిక్​ సంచుల్లో కట్టి కుప్పలుగా వేస్తున్నారు.

బహిరంగ ప్రదేశంలో ఇలా పడవేస్తున్న కారణంగా ఆస్పత్రికి వచ్చే రోగులు భయానికి లోనవుతున్నారు. సంచులను కుక్కలు బయటకు తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ చెత్తను బయో మెడికల్ ప్లాంట్స్​కు తరలించాల్సి ఉంది. జిల్లాలో నాయుడుపేటలో ఒక్క ప్లాంట్​ మాత్రమే ఉంది. ఈ ప్లాంట్​లో సమస్య నెలకొనడంతో చెత్తను ఆస్పత్రి ప్రాంగణంలోనే వేస్తున్నారు. వీటిని తరలించేందుకు పారిశుద్ధ్య కార్మికులు కూడా భయపడుతున్నారు. పీపీఈ కిట్లు, సిరంజ్​లు వంటివి తప్పకుండా బయో మెడికల్ ప్లాంట్​కు తరలిస్తున్నామని శానిటైజేషన్ నిర్వహకులు చెబుతున్నారు. ఇతర సాధారణ వ్యర్థాలను మాత్రం పారిశుద్ధ్య కార్మికులు తీసుకెళుతారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details