నెల్లూరులో ప్రముఖ ఇంద్రజాలికుడు జూనియర్ జాదూగర్ ఆనంద్ కళ్లకు గంతలు కట్టుకొని మోటర్ సైకిల్ నడుపుతూ ప్రేక్షకులను ఆలరించారు. ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శన నిర్వహించారు. నగర ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జున రావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళ్ళకు గంతలు కట్టుకున్న జూనియర్ జాదూగర్ ఆనంద్ రద్దీగా ఉండే రహదారిపై మోటార్ సైకిల్ నడిపి ఆకట్టుకున్నారు. నగరంలోని పురమందిరం నుంచి వి.ఆర్.సి., ఆర్.టి.సి., వేదయపాలెం, పొదలకూరు రోడ్డు, గాంధీ బొమ్మ మీదుగా తిరిగి టౌన్ హాల్ వరకు ఈ ప్రదర్శన సాగింది. కళ్ళకు గంతలు కట్టుకుని వాహనాలు జాగ్రత్తగా నడిపితే, అన్ని చూడగలిగిన వారు ఇంకా అప్రమత్తంగా నడపాలని జాదూగర్ ఆనంద్ పిలుపు నిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలను నివారించాలనే తాము ఈ ప్రదర్శన నిర్వహించినట్లు వెల్లడించారు.
ట్రాఫిక్పై అవగాహనకు జూనియర్ జాదూగర్ వినూత్న ప్రదర్శన
నెల్లూరులో ట్రాఫిక్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంద్రజాలికుడు జూనియర్ జాదూగర్ కళ్లకు గంతలు కట్టకుని మోటర్ సైకిల్ నడపుతూ ప్రేక్షకులను అలరించాడు.
ట్రాఫిక్పై అవగాహనకు జూనియర్ జాదూగర్ వినూత్న ప్రదర్శన