ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అగ్నిమాపక వాహనంతో.. మట్టి గణపయ్య నిమజ్జనం

By

Published : Sep 12, 2019, 11:59 PM IST

కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన 65 అడుగుల అతిపెద్ద మట్టి వినాయక విగ్రహానికి అగ్నిమాపక వాహనంతో నిమజ్జనం చేశారు.

శ్రీలక్ష్మి నరసింహా గణేష్ ఉత్సవ సమితి

65 అడుగుల అతిపెద్ద మట్టి వినాయక విగ్రహం

రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి వినాయక విగ్రహాన్ని కర్నూల్​లో నిర్వాహకులు అగ్నిమాపక వాహనం సాయంతో నిమజ్జనం చేశారు. శ్రీలక్ష్మి నరసింహా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ వద్ద 65 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే మట్టి విగ్రహాన్ని కరిగించారు. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న ఈ భారీ గణనాథుడిని... నిమజ్జనం చేసిన సందర్భంగా యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details