రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి వినాయక విగ్రహాన్ని కర్నూల్లో నిర్వాహకులు అగ్నిమాపక వాహనం సాయంతో నిమజ్జనం చేశారు. శ్రీలక్ష్మి నరసింహా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ వద్ద 65 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే మట్టి విగ్రహాన్ని కరిగించారు. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న ఈ భారీ గణనాథుడిని... నిమజ్జనం చేసిన సందర్భంగా యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి హాజరయ్యారు.