ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2021, 8:07 PM IST

ETV Bharat / city

జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు : వంగలపూడి అనిత

జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని.... రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాట్లాడిన ఆమె... రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అన్నారు.

tdp leader vangalapudi antitha fire on ycp government about anusha murder incident
రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. నరసరావుపేట తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ లేదనడానికి విద్యార్థిని కోట అనూష హత్యే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై హోంమంత్రి ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఒక మహిళ హత్యకు గురైతే రూ.10 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. అనూష కుటుంబసభ్యులకు న్యాయం జరిగే వరకూ తెదేపా పోరాడుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details